కోరుకొండ మల్లేశ్వరరావుకు ఘన సత్కారం

ఆమదాలవలస నియోజకవర్గం: శ్రీకాకుళంలో ఆదివారం జరిగిన భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ గ్లోబల్ అవార్డ్స్ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కోరుకొండ మల్లేశ్వరరావును ఆహ్వానించి, వారు చేసే సేవా కార్యక్రమాలను గుర్తించి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మల్లేశ్వరరావు మాట్లాడుతూ మెము చేసే సేవా కార్యక్రమాలను గుర్తించి, పెద్దల చేతుల మీదుగా సత్కరించి, ఆశీర్వదించినందుకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా డా. మణికంఠ గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటున్నానని తెలిపారు.