కేవీ చలమయ్యను మర్యాదపూర్వకంగా కలసిన గునుకుల కిషోర్

నెల్లూరు: నెల్లూరు జిల్లాకు ముందు పొట్టి శ్రీ రాములు అని చేర్చి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పెట్టండి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధించిన మహనీయులు, స్వాతంత్ర సమరయోధులు శ్రీ పొట్టి శ్రీరాములు గారికి గౌరవం ఇచ్చి జిల్లాని పేరు మార్చారు కాబట్టి మనం ఆయన కిచ్చే పెద్ద నివాళి అవుతుంది.. అంటూ నెల్లూరు జిల్లాలో ఏ పార్టీ నుంచి ఏ వార్త వచ్చినా కాల్ చేసి మరి నెల్లూరు జిల్లా ముందర శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉండాలి అని శ్రీ రాములు గారి గౌరవాన్ని కీర్తి ప్రతిష్టలను భావితరాలకు బాధ్యతను పరిచయంచేస్తున్న ప్రత్యేక ఆంధ్ర సమరయోధులు పొట్టి శ్రీరాములు సన్నిహితులు కేవీ చలమయ్య గారిని మర్యాదపూర్వకంగా నెల్లూరు సిటీ సంతపేట వారి నివాసంలో కలిసిన జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్.. ఎంతో వయసు ఉన్నా అంతకుమించి జ్ఞాపకశక్తి కలిగి ఉండి పలువురుని పలకరిస్తూ నెల్లూరు విశేషాలు కనుక్కుంటూ సరదాగా సాగే పెద్దాయనను కలిసి ఆశీర్వాదం తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మహనీయుల త్యాగాలను స్ఫూర్తిని మీవంటి మానవతామూర్తుల ప్రేమతో ముందుకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. పోరాటం అంటే తెలియని రోజుల్లోనే మనకంటూ రాష్ట్రం కావాలంటూ పోరాడిన మహనీయులను వారి పోరాట పటిమను స్మరిస్తూ సామాజిక సమస్యలను ప్రశ్నిస్తూ.. పోరాడే హక్కును బాధ్యతలను, పౌరులకు గుర్తు చేస్తూ ముందుకు సాగుతామని తెలపడం జరిగింది.