అన్నదానం గొప్ప పుణ్య కార్యక్రమం: గురాన అయ్యలు
విజయనగరం, అన్ని దానాల కంటే అన్నదానం గొప్ప కార్యక్రమమని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. శనివారం బీసీ కాలనీలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గురాన అయ్యలు మాట్లాడుతూ నవరాత్రోత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావం అలవర్చుకొని సమజానికి ఉపయోగపడే మంచి పనులు చేయాలని సూచించారు. సనాతన ధర్మాన్ని, మానవత విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందన్నారు. యువకులు మంచి మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీకాలనీ దేవీ నవరాత్రుల కమిటీ సభ్యులు, పట్ణణ జనసైనికులు ఎల్.రవితేజ, అడబాల వేంకటేష్ నాయుడు, వజ్రపు నవీన్ కుమార్, ఎమ్.పవన్ కుమార్, పృథ్వీ భార్గవ్, కె.సాయి తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-21-at-17.13.08-1024x634.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-21-at-17.13.08-1-989x1024.jpeg)