కొంతేరులో డంపింగ్ యార్డ్ కు ఎంపిక చేసిన స్థలాన్ని మార్చాలని కమిషనర్ కు వినతి

కొంతేరులో డంపింగ్ యార్డ్ కు ఎంపిక చేసిన స్థలాన్ని మార్చాలని కమిషనర్ కు వివిధ కుల సంఘాల నాయకులు పిర్యాదు చేసినట్టు జనసేన జిల్లా నాయకుడు యల్.పి.యఫ్ చైర్మన్ ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ తెలియజేసారు. ఇంతకు ముందే యలమంచిలి మండల తహసీల్దార్ కి పిర్యాదు చేసినట్టు, కలెక్టర్ కి కుడా చేయబోతున్నట్టు ఆయన తెలియజేసారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు వ్యతిరేకమైన ఇబ్బంది కలిగించే పనులు ఎప్పటికి చేయమని స్థలాన్ని కొన్నమాట వాస్తవమేనని మీ అభ్యర్థనను పరిశీలిస్తామని మీరు కుడా మాకు సహకరించాలని తెలియజేసారు..ఈ కార్యక్రమంలో వర్ధనపు సూర్య నారాయణ మూర్తి, గంట శ్రీను, ఉన్నమట్ల నాగేశ్వరావు, సాదే శ్రీను, కుంచనపల్లి శ్రీనివాస్, తెన్నేటి పుష్పరాజు, నక్క శ్రీను, ఆడాపు రమేష్, ఉన్నమట్ల రాజశేఖర్, కండవల్లి నరేంద్ర, ఉన్నమట్ల హెమరాజు, జల్లి శాంతరావు, కొయ్యే నర్సింహా మూర్తి, గొల్లమందుల చలపతి రావు, తెన్నేటి శ్రీను, లక్కవరపు యోబు, తదితరులు పాల్గొన్నారు.