పెమ్మాడ సతీష్ ను పరామర్శించిన గురుదత్
రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామ జనసేన పార్టీ యువనేత మండల ప్రధాన కార్యదర్శి పెమ్మాడ సతీష్ కాలికి గాయం అయ్యింది. స్థానిక జనసైనికుల ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ తక్షణమే వారిని పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, రాజానగరం మండల జనసేన పార్టీ కో-కన్వీనర్ నాగవరపు భాను శంకర్, కోరుకొండ మండలం జనసేన పార్టీ సీనియర్ నాయకులు చదువు ముక్తేశ్వరరావు, కొచ్చర్ల భరత్, చల్లా ప్రసాద్, పెద్దకాపు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-01-at-7.05.14-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-01-at-7.05.15-PM-1024x768.jpeg)