సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు..

ఏలూరు: సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఏలూరు పట్టణంలోని జన్మభూమి పార్క్ వద్ద సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు సూపర్ స్టార్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి, భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో రాజకీయానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఏలూరు కృష్ణ అభిమానులు & మహేష్ బాబు యువసేన వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి కృష్ణ గారి ప్రతిమను అందజేశారు.. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఏలూరులో సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు మహేష్ బాబు గారి అభిమానులు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఆపదలో ఉన్నవారికి ఎంతోమందికి రక్త దానాలు చేస్తూ, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.. ఈరోజు ఏలూరులో కృష్ణ గారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం.. దీనికి మమ్మల్ని ఆహ్వానించిన సూపర్ స్టార్ కృష్ణ మరియు మహేష్ బాబు గారి అభిమానులకు అభినందనలు తెలియజేస్తున్నాం.. ఇక్కడ ఆయన విగ్రహం పెట్టడం ఎంతో ఆనందంగా ఉందని కృష్ణ గారి ఆశయాలను అభిమానులు నిరంతరం ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఏలూరు కృష్ణ గారి అభిమానులకు మహేష్ బాబు అభిమానులకు పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు.. ఈ కార్యక్రమంలో ఏలూరు కృష్ణ అభిమానులు, మహేష్ బాబు అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు..