ఘనంగా జానీ జయంతి వేడుకలు

నాగర్ కర్నూల్: జనసేన పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు ఎం జాని జయంతి సందర్భంగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు, నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంగ లక్ష్మణ్ గౌడ్ పిలుపు మేరకు ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జాని ఫోటోకి నివాళులు అర్పించి, అనంతరం నాగర్ కర్నూల్ పట్టణ పరిధిలోని అనాథ ఆశ్రమంలో జాని జయంతిని పురస్కరించుకొని చిన్నారులతో కేక్ కట్ చేయించి, పండ్లు డొనేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కోడిగంటి సాయి కుమార్, ఎదుల శరత్ గౌడ్, సూర్య, వంగురు బైండ్ల మహేష్, చేన్నమొని మహేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.