దాతృత్వాన్ని చాటుకున్న శ్రీరామ రామాంజనేయులు

మదనపల్లి నియోజకవర్గం: కొత్త వారి పంచాయతీ గుండవారిపల్లెలో శ్రీరామ రామాంజనేయులు జనసేన ప్రచారంలో భాగంగా మదనపల్లిలో పర్యటించిన సమయంలో భర్త చనిపోయిన ఇద్దరు చిన్న బిడ్డల తల్లి గౌతమి తను ఉండటానికి ఇల్లు లేదని, ఉన్న ఇల్లు కూడా సిమెంట్ రేకులు నెర్రులు చీలి వర్షం వస్తే పక్కిండ్లకు వెళ్లి తల దాచుకోవాల్సిన దుస్థితిలో ఉన్నానని కన్నీటి పర్యంతమయ్యారు. వెంటనే చలించిన శ్రీరామ రామాంజనేయులు ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఆడబిడ్డ బాదను చూడలేక ఆ సిమెంట్ రేకులు తొలగించి కొత్త రేకులు వేయించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు..
శ్రీ రామ రామాంజనేయులు గౌతమీకి చేసిన ఈ సహాయం ఊరు ఊరంతా ఆనందంగా అభినందనలు తెలియజేశారు. ఇలాంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని, వెంటనే ఈమెకు ఇల్లు మంజూరు చేయాలని, పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.