సంక్రాంతి శుభాకాంక్షలు: కనపర్తి మనోజ్ కుమార్

కొండెపి: పొన్నలూరు మండలం ప్రజలందరికీ పొన్నలూరు జనసేన అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగల్లో ఒకటైన సంక్రాంతి పండుగ ప్రజలందరూ కన్నుల పండుగగా కుటుంబ సభ్యులతో మరియు బంధువులతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను, ప్రజలందరూ సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో, ఆనందపు చిరునవ్వుతో, ఎటువంటి గొడవలు లేకుండా, మంచి, మర్యాద, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అభిమానంతో భోగి, సంక్రాంతి, కనుమ, పండుగలు జరుపుకోవాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.