తన బర్త్‌డే సందర్భంగా 300 మంది అనాథ పిల్లలకు సాయం

యంగ్ హీరో సందీప్ కిషన్ తన బర్త్ డే సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా తన టీమ్ ద్వారా 300 మంది అనాథ పిల్లలకు ఆహారాన్ని అందించారు. ఆ సమయంలో వారి ముఖంలో కనిపించిన ఆనందం చూసి చాలా సంతోషించారు. కరోనా వలన పెద్ద వాళ్లు చనిపోతే వారి పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు. అలాంటి వారిని రెండేళ్లే పాటు తాను చూసుకుంటానని కొద్ది రోజుల క్రితం సందీప్ అనౌన్స్ చేశారు.

ఈ ఏడాది ఏ1 ఎక్స్‌ప్రెస్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ కిషన్ ప్రస్తుతం గల్లీ రౌడీ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక తాజాగా ఆయన 28వ సినిమాను కూడా ప్రకటించారు. ఆరేళ్ల క్రితం వీఐ ఆనంద్ దర్శకత్వంలో టైగర్ అనే సినిమా చేసిన సందీప్ ఇప్పుడు మరో కొత్త చిత్రం చేయనున్నాడు. హాస్య మూవీస్‌ పతాకంపై రాజేష్‌ దండ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కథ, కథనాల ప్రకారం ఇది సందీప్‌ కెరీర్‌లో ఓ ప్రయోగాత్మక చిత్రంలా నిలుస్తుంది. సందీప్‌ నుంచి ప్రేక్షకులు ఆశించే కొత్తదనం, వైవిధ్యమైన అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. కోవిడ్‌ ప్రభావం తగ్గిన తర్వాత చిత్రీకరణ ప్రారంభిస్తాం అని నిర్మాతలు అన్నారు.