డ్రగ్స్ కేసులో రకుల్ పేరు.!

బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరవాత రియా సుశాంత్ కు డ్రగ్స్ ఇచ్చింది అంటూ ఆరోపణలు రావడంతో అధికారులు ఆ దిశగా విచారణ జరిపగా. విచారణలో రియాకు డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్టు తేలింది. దాంతో ఆమెను అరెస్ట్ చేసి డ్రగ్స్ తో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయన్న కోణంలో విచారిస్తుoడగా. ఈ కేసు విచారణలో రియా చక్రవర్తి ఎన్‌సీబీ అధికారులకు పలు కీలక పేర్లను వెల్లడించినట్లు సమాచారం. వారిలో టాలీవుడ్‌తోపాటు.. పలు బాలీవుడ్ సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించిన హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్ పేరు కూడా ఉంది. అంతే కాకుండా సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్, రణవీర్ సింగ్ స్నేహితురాలి పేర్లను వెల్లడించినట్టు తెలుస్తుంది.

జూన్ 14 న ముంబైలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత.. ఈ కేసును అనేక కోణాల్లో సీబీఐ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో డ్రగ్స్ వ్యవహారంలో రియా, ఆమె సోదరుడు శౌమిక్ చక్రవర్తిని, సుశాంత్ ఇంట్లో పనివాళ్లను ఎన్‌సీబీ అరెస్టు చేసింది.