అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎన్ని రాజు

రాజాం, భారత రాజ్యాంగ రూపశిల్పి, ప్రపంచ మేధావి, మానవ హక్కుల ప్రధాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను ఎన్ని రాజు ఆధ్వర్యంలో రాజాం నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీస్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ ఏ కులానికో, ఏ మతానికో, ఏ ప్రాంతానికో పరిమితం చేయలేము. ఎందుకంటే ప్రతి భారతీయుని గుండెపై చెదరని ముద్ర వేసిన మహనీయుడు. అతని ఆశయాలను, సిద్ధాంతాలను సమన్యాయంతో ముందుకు తీసుకువెళ్తామని, ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల జనసైనికులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.