మార్కాపురం జిల్లా చెయ్యాలని కోరుతూ జెఏసీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్ష

మార్కాపురం జిల్లా చెయ్యాలని స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ఆమరణ నిరాహారదీక్షలో కూర్చున్న జేఏసి వైస్ చైర్మన్ మరియు జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జి ఇమ్మడి కాశీనాథ్, జేఏసి కన్వీనర్ షేక్ సైదా, జేఏసి ఛైర్మన్ కందుల నారాయణరెడ్డి, సిపిఎం నాయకులు జి.బాల నాగయ్య, అమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ వి.సుదర్శన్, వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి.

ఈ దీక్షలో ఇమ్మడి కాశీనాధ్ మాట్లడుతూ కొంతమంది వైసిపీ నాయకులు జిల్లా వస్తే పన్నులు పెరుగుతాయని అవగాహనలేని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొంతమంది నాయకులు తమ రాజకీయ స్వార్థం కోసం రానున్న రోజుల్లో భావితరాల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని, ప్రజలు వారి బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అత్యధిక మెజారిీతో గెలిపించి మీ నాయకులు మీరు ప్రజలకు సేవ చేస్తారనుకున్నారు, మీకు నిజంగా నాయకత్వ లక్షణాలు ఉంటే ఒక పూల సుబ్బయ్య గారిల ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే పనులు చెయ్యాలి కాని, పశ్చిమ ప్రాంతానికి చెందిన మంత్రి అంటారని మిమ్మల్ని గెలిపించిన ప్రజలను మోసం చేసి రాజకీయ లబ్ధి కోసం ఆత్మ వంచన చేసుకొని జిల్లా రాకుండ అడ్డుపడుతున్నారని ఇప్పటికైన కళ్ళు తెరచి జిల్లా సాధనకు సహకరించి, ముఖ్య మంత్రి గారిని ఒప్పించాలని తెలియజేసేశారు. ఈ దీక్షకు మద్దతు తెలిపిన జిల్లా సీపీఐ కార్యదర్శి ఎం.ఎల్.నారాయణ, నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి అందే నాసరయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున, సిపిఎం రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ జలా అంజయ్య, పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్, జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అభిమానులు పాల్గొన్నారు.