బాబుతో నేను సైతంకు యూఏఈ జనసేన సంఘీభావం

యూఏఈ: బాబుతో నేను అన్న నినాదంతో యూఏఈలో జనసేన మిత్రపక్షమైన తెలుగుదేశం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం దుబాయ్ నగరంలో నెల్లూరు జిల్లా తెలుగుదేశం ఇంచార్జ్ డాక్టర్ వి ఎం థామస్ యూఏఈ జనసేన నుండి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరడంతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు తెలుగుదేశంతో కలిసి పనిచేయడం, నారా చంద్రబాబు నాయుడు ను అరెస్ట్ చేసిన విధానంపై జనసేన మొదటి నుండి పోరాటం చేస్తుంది. ఈ సందర్భంగా యూఏఈ జనసేన నాయకులు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ చేస్తున్న ఆగడాలను రాక్షస పాలన నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీతో కలిసి నడవడానికి నిర్ణయించుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి నిర్మూలన కోసం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేస్తున్న విశ్రాంత పోరాటంలో యూఏఈ జనసేన ఎప్పుడూ తోడు ఉంటుందని, అధ్యక్షులు ఈ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర శ్రేయస్సు కోసం తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా మనస్పూర్తిగా ఆహ్వానిస్తూ ముందుకు అడుగులేస్తుందని ఈ సందర్భంగా యుఏఈ జనసేన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి యూఏఈ జనసేన నుండి పాపోలు అప్పారావు, శ్రీహరి, రవికుమార్, సుధాకర్ పాల్గొని తెలుగుదేశానికి సంఘీభావం ప్రకటించారు.