ఒకరు పోతే జనసేనలోకి వందమంది వస్తారు – మీడియా సమావేశంలో తిరుపతి జనసేన

  • వైసీపీ చీప్ పాలిటిక్స్ మానుకోవాలి.
  • రాష్ట్రంలో రాబోయేది జనసేన ప్రభుత్వంమే.
  • దమ్ముంటే రాజీనామా చేయండి, తిరుపతిలో ఎలక్షన్ కు పోదాం.
  • పగడాల మురళిని బలవంతంగా చేర్చుకున్నారు.
  • మీరు బలవంతం చేసి వైసీపీలో చేర్పించుకోలేదని కాణిపాకంలో ప్రమాణం చేస్తారా..?

తిరుపతి, మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులుగా మెలుగుతున్న జనసేన పార్టీ నాయకుడు పగడాల మురళిని బలవంతంగా వైసీపీ పార్టీలోకి చేర్చుకున్నారని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాక్షస పాలన ఎలా ఉంటుందో వైసిపి పార్టీ రాష్ట్ర ప్రజలకు చవిచూపిస్తోందన్నారు. ఒక్క పగడాల మురళి వెళ్లిపోతే జనసేన పార్టీకి నష్టం జరుగుతుందని అనుకోవడం వైసీపీ నాయకుల అవివేకమని మెగా ఫ్యామిలీకి ఓ హనుమంతుడిగా గుర్తింపబడిన మురళి బ్రతుకు తెరువుపైన దెబ్బ కొట్టి దౌర్జన్యంగా వ్యవహరిస్తూ వైసిపి నాయకులు లోబర్చుకొని పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. ఎటువంటి బలవంతము లేకుండా పార్టీలో మురళి చేరాడని వైసీపీ నాయకులు కాణిపాకంలో ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికల జరిగిన తిరుపతిలో వైసీపీ పార్టీలో పదవులు పొందిన 118 మంది ఓట్లు మాత్రమే వస్తాయని, ప్రజలంతా జనసేనకు మద్దతుగా ఉన్నారని అన్నారు. జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇన్చార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ పగడాల మురళికి 2009లో చిరంజీవి వారు ఇప్పించిన షాపులను సీజ్ చేయడమే కాకుండా బెదిరింపులకు దిగారని, దీనికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించినా అతను భయభ్రాంతులకు గురయ్యాడని, వైసీపీ ఇలాంటి చీఫ్ పాలిటిక్స్ లను మానుకోవాలని ప్రజలే మీకు త్వరలో బుద్ధి చెపుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో రాబోయేది జనసేన ప్రభుత్వమేనని మీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి తిరుపతిలో ఎలక్షన్లకు వచ్చి మీ సత్తా ఏంటో నిరూపించుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు పోతే జనసేనలోకి వందమంది వస్తారని, జనసేన అంటే మీకు ఎంత భయం ఉందో అర్థమవుతుందని, ఒక్క పగడాల మురళిని మీ పార్టీలో చేర్పించుకున్నంత మాత్రాన పదివేల ఓట్లు మీకు పోతాయని, అదే పదివేల ఓట్లు జనసేన పార్టీకి వస్తాయని ఈ సందర్భంగా ఆయన జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, బాబ్జి, ముక్కు సత్యవంతుడు, సుమన్ బాబు, బాటసారి, పార్థు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.