మా నాయకుడు కనుసైగ చేస్తే రాష్ట్రం, రావణకాష్టంగా మారుతుంది: వాసగిరి మణికంఠ

విశాఖపట్నంలో శనివారం రాత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకోవడం మరియు జనసేన పార్టీ నాయకుల అక్రమ అరెస్టులు గురించి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ చేసిన గర్జన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా, జనసేనాని పవన్ కళ్యాణ్ కు వైజాగ్ పర్యటనలో మద్దతు పలుకుతూ వచ్చిన జనసంద్రాన్ని చూసి ఓర్వలేక ప్రభుత్వం పోలీసులతో అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. మా నాయకుడు కనుసైగ చేస్తే రాష్ట్రం రావణకాష్టంగా మారుతుందని, వైసీపీ ప్రభుత్వం వెంటనే స్పందించి జనసేన నాయకులను బేషరతుగా విడుదల చేయాలని ధ్వజమెత్తారు. అలాగే రాజకీయ నాయకులు 5 సంవత్సరాలకు మాత్రమే అధికారంలో ఉంటారు కానీ 30 సంవత్సరాలు సర్వీస్ లో ఉండే పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరించాలని మనవి చేశారు.