పవన్ కళ్యాణ్ కు ఏదైనా జరిగితే జనసైనికుల ఆగ్రహ జ్వాలకు బలైపోతారు

మదనపల్లి, పవన్ పవన్ కళ్యాణ్ పై ఈగ వాలినా జగన్ దే భాధ్యత.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి హెచ్చరించారు. గురువారం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో గెలవలేమని, ప్రజాదరణ కలిగిన పవన్ పై దాడి చేయడానికి ప్రణాళిక వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‌వైజాగ్ లో జరిగిన ఘటన అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇలా దిగజారుడు రాజకీయలకు పాల్పడితూ ఆంధ్రలో పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా పోలీసు పాహర కాస్తూ, హైదరాబాద్ లో గుండాలు, వైసిపి నాయకులు రెక్కిలు నిర్వహించడం పవన్ కళ్యాణ్ కు అపాయం తలపెట్టడమే అన్నారు.‌ కుక్కను చంపి బాబాయ్ ని కుక్కలాగా చంపిన ఘనత వారిదే అన్నారు. పవన్ కి ఏమైన జరిగితే జనసైనికులు ఆగ్రహానికి మాడి మసి అయిపోయారని హెచ్చరించారు. ‌ఈ రెక్కీ జరిపిన వారిని విచారించాలని డిమాండ్ చేశారు. ‌పవన్ కళ్యాణ్ కి అనుకూలంగా సర్వేలు వెల్లడిస్తున్నాయని,‌ దినిని భరించలేక ఎలాగైనా పవన్ పై దాడి చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‌పవన్ పై ఒక్క గీత పడ్డా, ఒక్కొ జనసైనికుడు ఒక వీర జవాన్ లు గా మారి మీ‌ అంతు చూస్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో జంగాల శివరామ్ రాయల్, అమరనారాయణ, అడపా సురేంద్ర, గ్రానైట్ బాబు, జగదీష్, కుమార్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ‌