జనసేన పార్టీలోకి భారీ చేరికలు..

వీర మహిళలకు స్వాగతం పలికి పార్టీలోకి ఆహ్వానించిన: గాదె

గురువారం గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సమక్షంలో 21 వార్డు నుంచి వీర మహిళలు తన్నీరు రాజ్యలక్ష్మి, రొక్కం ఝాన్సీ గార్ల ఆధ్వర్యంలో వీర మహిళలు జనసైనికులు నూతనంగా పార్టీలోకి చేరడం జరిగింది. వీరి అందరికీ స్వాగతం పలుకుతూ మెడలో కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన గాదె వెంకటేశ్వరరావు.

ఈ సందర్బంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జనసేన పార్టీ రోజు రోజుకీ ప్రజల ఆదరణ పొందుతుంది అనడానికి ఇదే ఒక నిదర్శనం. ఈరోజు మా వీర మహిళలు తన్నీరు రాజ్యలక్ష్మి, రొక్కం ఝాన్సీ ఆధ్వర్యంలో 30 మంది మహిళలు 10 మంది జన సైనికులు ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. వీరి అందరికి స్వాగతం పలుకుతూ వారి మెడలో కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
ఇలాంటి శుభ పరిణామం జరగటం మాకు గాని, కార్యకర్తకలకు గాని ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మా వీర మహిళలు జనసేన పార్టీకి వెన్నుముకలా నిలిచి పార్టీని ముందుకు నడిపించడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు దానికి చాలా గర్వపడుతున్నాను. అలాగే మీరు భవిషత్ లో ప్రతి పార్టీ కార్యక్రమంలో ముందుండి నడిపించాలని వీర మహిళలను కోరడం జరిగింది. భవిష్యత్తు రాజకీయం మొత్తం మా వీర మహిళల చేతిలో ఉంది అని చెప్పటానికి చాలా గర్వపడుతున్నాను. అలాగే రానున్న రోజుల్లో మన పార్టీ రోడ్లపైకి వచ్చి అధికార ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఎండగట్టే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం అందరం కలిసికట్టుగా వాటిని ఎదుర్కొనే విధంగా ప్రణాళికని ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు..

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాల రావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, నెల్లూరు రాజేష్, శ్రీపతి భూషయ్య, దాసరి వెంకటేశ్వరరావు, మధులాల్, ఎస్ కె.జమిర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.