శివారెడ్డి చల్లా ఆధ్యర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా, పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా చొప్పదండి పట్టణంలో మదిన మస్జీద్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చల్లా శివారెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సహోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశం విభిన్న సంస్కృతుల కలయిక, ఇక్కడ ప్రతి ఒక్కరూ సహోదర భావంతో కలిసిమెలసి జీవనాన్ని సాగిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాం అన్నారు. కుల మత ప్రస్తావన లేని భావి భారతావని సాధించడం మన సంకల్పం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ముస్లిం సంఘం అధ్యక్షులు జహీరుద్దీన్, ముస్లిమ్ యువజన సంఘం అధ్యక్షులు ఫయాజ్, సాయి గణేష్ ,సాయి పవన్ షారుక్, మదిన మాస్జీద్ కమిటి సభ్యులు అబ్దుల్ నబీ, సలీం, అంజాద్, చాంద్, అజీజ్, అన్వర్, ఆరిఫ్, సులేమాన్, సాధిక్, తదితరులు.