మెరుగుపడిన గాన గంధర్వుని ఆరోగ్యం:ఎస్.పి చరణ్,శివలెంక కృష్ణప్రసాద్

గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్ రావడంతో గత పదిరోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఉన్నట్లుండి ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారిందని వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రముఖులు, సామాన్యులు అందరూ కోరుతూ.. ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మెరుగుపడిందని నాన్న కోలుకుంటున్నారని ఎస్.పి. బాలు తనయుడు ఎస్.పి చరణ్. తెలిపారు.

అదే విధంగా ప్రస్తుతం ఎస్పీబీ ఆరోగ్యం మెరుగుపడింది. విషమ పరిస్థితి నుంచి కోలుకుంటున్నారు. ఎప్పటిలాగే ఆయన పాటలతో అలరిస్తారని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు.