తారు పరిశ్రమ లైసెన్స్ రద్దు చేయాలని స్పందనలో జనసేన ఫిర్యాదు

నెల్లిమర్ల: పూసపాటిరేగ మండలం, కోనాడ గ్రామంలో నిర్మించిన నిత్య సాయి కోల్ తారు పరిశ్రమ లైసెన్స్ రద్దు చేయాలని సోమవారం స్పందనలో జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార వికాస విభాగం కార్యదర్శి కారి అప్పలరాజు జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నూకరాజుకి వినతి పత్రం అందజేశారు. ఈ తార్ పరిశ్రమ వెదజల్లుతున్న కాలుష్యం వల్ల దుర్వాసన వస్తుందని మరియు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 300 మీటర్ దూరంలో ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.