మదనపల్లి జనసేన కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  • జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వీరమహిళలకు అభిమానులకు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత మరియు మదనపల్లి జనసేన నాయకులు

మదనపల్లి: జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వడుకలలో భాగంగా గురువారం ఉదయం 10 గంటలకు మదనపల్లి జనసేన కార్యాలయంలో జనసేన 11 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన జెండా ఎగరవేసి కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన నా సేన నా వంతు కమిటీ సభ్యురాలు మరియు చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత మరియు మహిళా నాయకులు శ్రీమతి మల్లికా, రూప మదనపల్లి జనసేన నాయకులు కుప్పాల శంకర, కోటకొండ చంద్రశేఖర్, అశ్వత్, ధరణి, సుప్రీం హర్ష, జనసేన సోను, నవాజ్, శ్రీనివాసులు శ్రీనాథ్ గణేష్ యాసీన్ మరియు జనసేన కార్యకర్తలు. ఈ సందర్భంగా దారం అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్లు అస్తవ్యస్తమైపోయి సరైన రోడ్లు లేక ఆంధ్రప్రదేశ్ రోడ్లపై ప్ ప్రమాదాలకు గురై చనిపోయిన 62 కుటుంబాలకి మూడు కోట్ల పది లక్షల(3,10,00,000) రూపాయలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన సొంత నిధి నుండి ఇవ్వడ మైనదని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కనీసం రాష్ట్రంలోని ప్రజలు కు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా విఫలమైపోయిందని కచ్చితంగా తొందర్లోనే ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేశారు.