7 జనసేన జెండాల ఆవిష్కరణ

చిలకలూరిపేట, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని చిలకలూరిపేట పట్టణం జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు పెంటేల బాలాజీ ఆధ్వర్యంలో జనసైనికులలు, వీరమహిళలు, కార్యకర్తలు, అభిమానులతో వందల మంది కార్యకర్తలు ర్యాలీ నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు పెంటేల బాలాజీ స్వగృహం నుండి సోమవారం మధ్యాహ్నం ఎన్నార్టీ సెంటర్, రిజిస్టర్ ఆఫీస్, చౌత్రా సెంటర్, రూరల్ పోలీస్ స్టేషన్ సెంటర్, కళామందిర్ సెంటర్ మీదగా, వేలాదిమందితో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీలో భాగంగా ఎన్ ఆర్ టీ సెంటర్, జాగుపాలెం, అచ్చమ్మ బావి వీధి, వడ్డెర కాలనీ, ఊసా సుబ్బయ్య వీధి, వేజండ్ల వారి వీధి, పొన్నంవారి వీధి, కళామందిర్ సెంటర్ వాటర్ ట్యాంక్ ఎదురు మొత్తం 7 జనసేన జెండాలను ఆవిష్కరణలు చేసారు. ఈ సందర్భంగా పెంటేల బాలాజీ మాట్లాడుతూ రానున్న సాధారణ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేవరకు జనసేన పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఈ దోపిడి ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దించుదాం అని ఎదురుచూస్తున్నారని, బడుగు బలహీన వర్గాలు ప్రశాంతంగా సమాజంలో జీవించాలంటే రాష్ట్రంలో జనసేన పార్టీ జెండా ఎగరాలని ఆయన తెలిపారు. అలానే ఈ కార్యక్రమం విజయవంతం చేయటానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి బాలాజి ధన్యవాదములు తెలియచేసారు, ముఖ్య అతిధిలుగా విచ్చేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి కన్నా రజని మాట్లాడుతూ ప్రభుత్వం కేవలం అవినీతి పరులకె అభివృద్ధి చేస్తున్నదని, రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని చరిత్రలో నిలబెట్టిందని, వైస్సార్సీపీ 151 మంది ఎమ్ ఎల్ ఏ లు ఉన్నా రేపు జరిగే ఎన్నికలలో మీకు ఏ ఒక్క ఎమ్ ఎల్ ఏ కూడా నీతో ఉండరని విమర్శలు చేసారు, జిల్లా కార్యదర్శి నిశ్శంకర శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన విజయం కోసం మేము ఎంత దూరం అయినా వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా రాష్ట్ర అధికార ప్రతినిధి కన్నా రజని, ఉమ్మడి జిల్లా కార్యదర్శి నిశ్శంకర శ్రీనివాసరావు, జనసైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.