ఆమదాలవలస జనసేన ఆధ్వర్యంలో మువ్వన్నెల జెండా ఆవిష్కరణ
ఆమదాలవలస నియోజకవర్గంలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీస్ పరిధిలో జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జీ పేడాడ.రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఎంతోమంది వీరులు ప్రాణం త్యాగాలు చేస్తే కానీ రాని ఈ స్వతంత్రం 75 సంవత్సరాలు వీరులందరికీ నా పాదాభివందనాలు.. భారతదేశం కోసం ఎంతోమంది మహనీయులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి మనకు స్వాతంత్రంను తెచ్చి పెట్టారని, ప్రతి ఒక్క మహనీయులను ఆదర్శంగా తీసుకొని వారు వేసిన మంచి బాటలో నడవాలని.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ యొక్క సిద్ధాంతాలు, ఆశయాలు దేశం కోసం పోరాడిన మహనీయులను ఏప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.