కొత్తచెరువు కేంద్రం జనసేన ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పుట్టపర్తి నియోజకవర్గం, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా సోమవారం పుట్టపర్తి నియోజకవర్గం, కొత్తచెరువు కేంద్రంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు పూల శివప్రసాద్ ఆధ్వర్యంలో మరియు కొత్తచెరువు బాల బాలికల ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చెన్న కృష్ణారెడ్డి, శ్రీమతి సుమునా మేడం సహకారాలతో విద్యార్థులతో 100 అడుగుల జెండాలతో ర్యాలీగా వచ్చి కొత్తచెరువు కూడలిలో నాలుగు రోడ్లకు ప్రదర్శన చేసి ప్రజలు మరియు విద్యార్థుల మదిలో జాతీయ భావాన్ని పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ సందర్బంగా శివ ప్రసాద్ మాట్లాడుతూ మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రం రావడానికి లక్షల మంది ప్రాణత్యాగాలు చేశారు.. వారిని స్మరించుకుంటూ ఈరోజు మనం ఘనంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము రేపటి బావ భారత పౌరులైన విద్యార్థులు ప్రతి ఒక్క రంగంలోనూ ఉన్నత స్థాయికి చేరుకుని ఈ దేశ కీర్తిని పెంచాలని తెలియజేశారు. అదేవిధంగా విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. మరియు పాఠశాలలో విద్యార్థిని విద్యార్థుల చేత స్వాతంత్ర సమరయోధుల వేషధారణతో నాటక ప్రదర్శన చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కొత్తచెరువు ఉన్నత బాలురు మరియు బాలికల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *