భారత్- ఆస్ట్రేలియా మహిళా వన్డే సిరీస్ వాయిదా
భారత్- ఆస్ట్రేలియా మహిళా వన్డే సిరీస్ వాయిదా పడింది. ఆసీస్తో జరగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను వాయిదా వేస్తున్నట్లు కొద్దీసేపటి క్రితం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా ఈ సిరీస్ను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది ఈ సిరీస్ ను నిర్వహిస్తామని వెల్లడించింది. టీమిండియా-ఆసీస్ మహిళా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్తో పాటు..మూడు టీ20లను చేర్చాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆసీస్ క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది.