తాను అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే భారత్‌కు మేలు: అభ్యర్థి జో బైడెన్‌

అమెరికాలో నవంబర్‌ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌తో జో బైడెన్‌ తలపడనున్న అభ్యర్థి జో బైడెన్‌ తాను అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే, భారత్‌ సరిహద్దుల్లోనూ, ఇతర భూభాగాల్లోనూ, భారత్‌ ఎదుర్కొంటోన్న సవాళ్లను అధిగమించడంలో అమెరికా భారత్‌ పక్షం వహిస్తుందని డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడడానికీ, ఇండో అమెరికన్‌లు పరస్పర సహకారంతో కలిసి జీవించడానికి, ఇరుదేశాల మధ్య స్నేహాన్ని కొనసాగించడానికి కృషి చేస్తానని ఆయన ప్రతిజ్ఞచేశారు.