గుంతకల్లు జనసేన ఆద్వర్యంలో 3వ రోజు టిడ్కో ఇళ్ల పరిశీలన

  • #JaganannaMosam 3వ రోజు

గుంతకల్లు నియోజకవర్గం: జగనన్న ఇళ్ళు – పేదోళ్ళ కన్నీళ్ళు సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా సోమవారం సోషల్ ఆడిట్ కార్యక్రమం నిర్వహించి. సచివాలయం కార్యాలయానికి వెళ్లి ప్రభుత్వం కట్టిస్తున్న ఇళ్ల పై సమాచారం కోరిన అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్ నిర్మిస్తున్న ఇళ్లు ఎంతవరకు పూర్తయినాయి అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లకు కనీస సౌకర్యాలు రోడ్లు, వాటర్ రిజర్వాయర్, కల్పించకుండా ప్రధాన రహదారులకు 5అడుగుల దిగువన నిర్మిస్తున్నారు. ఇలా నిర్మిస్తున్న ఇళ్లు మరో ఇందిరమ్మ గృహాల మాదిరిగా డ్రైనేజ్ వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందిలకు గురవుతారని ఎద్దేవా చేశారు. అలాగే కార్యక్రమంలో బోయ విరేష్, కార్యనిర్వహణ కమిటీ సభ్యుడు అమీర్ సోహిల్, హెన్రీ పాల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.