కాకినాడ జనసేన ఆద్వర్యంలో టిడ్కో ఇళ్ళ పరిశీలన

కాకినాడ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగనన్న ఇల్లు పేదలకు కన్నీళ్లు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్త శశిధర్, సిటీ అధ్యక్షులు అశోక్, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, సిటీ నాయకులు, కాకినాడ సిటీ 10వ డివిజన్ నాయకులు దాసరి వీరబాబు, కార్యకర్తలు అందరూ కలిసి టిట్కో ఇల్లు పరిశీలన చేయడం పేదవాళ్ళకి పవన్ కళ్యాణ్ అండగా నిలుస్తారని శ్రీ ముత్తా శశిధర్ హామీ ఇవ్వడం జరిగింది.