అమలాపురంలో తక్షణమే ఇంటర్నెట్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలి: పి. విజయ్ కుమార్

అమలాపురంలో తక్షణమే ఇంటర్నెట్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ ఏలూరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

రాష్ట్రంలో రావణకాష్టం పరిపాలన జరుగుతుందని.. జనసేన పార్టీకి, దళితులకు మధ్య ప్రభుత్వం చిచ్చు పెడుతుందని ఆరోపించారు.. అదేవిధంగా రాష్ట్రంలో కులాల మధ్య అల్లర్లను సృష్టిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జనసేన పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి జగన్ ప్రభుత్వం ఇటువంటి అల్లర్లు సృష్టించి పార్టీపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. మంత్రి ఇంటిపై దాడి జరిగినప్పుడు ఇంటిలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, బోడపాటి శివదత్, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ గౌతమ్, ఏలూరు నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్ తదితరులు పాల్గొన్నారు.