కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా జనసేన

అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఇంటింటా జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తపోవనం సర్కిల్ నందు అనంతపురం నియోజకవర్గ ప్రజలతో మమేకమై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో ఆ ఆశయాలను వివరిస్తూ స్థానిక ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేన పార్టీ ఆవశ్యకతను, క్రియాశీలక సభ్యత్వ ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, నార్పల రామకృష్ణ, తోట ఓబులేసు, వినోదం లోకేష్, భవాని నగర్ మంజునాథ్, బాల కార్తీక్, సాయి, ప్రవీణ్ కుమార్, నారాయణ నాయక్, హేమంత్ నాయక్, కళ్యాణ్, కర్ణ , పురుషోత్తం నాయక్ , రాజు, మహేష్ కుమార్, పోతురాజుల అశోక్, పబ్బిశెట్టి మంజునాథ్, ప్రవీణ్ కుమార్, వెంకటకృష్ణ, ప్రతాప్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.