కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో “ఇంటింటా జనసేన”
అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో “ఇంటింటా జనసేన” కార్యక్రమం ద్వారా. అనంతపురం నియోజకవర్గంలో నారాయణపురం, తపోవనం, 3వ రోడ్డు, 4వ రోడ్డు, 5వ రోడ్డు కాలనీలో క్రియాశీలక సభ్యులను కలిసి వారి ఇంటికి వెళ్లి క్రియాశీలక సభ్యత్వ కిట్లు అందజేస్తూ, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో… ఆ ఆశయాలను వివరిస్తూ ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేన పార్టీ ఆవశ్యకతను తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, అనంతపురం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు లాయర్ మురళీకృష్ణ, జక్కిరెడ్డి ఆదినారాయణ, లాల్ సాబ్, కలిమిశెట్టి రమణ, చిరంజీవి, ఎల్లుట్ల మంజునాథ్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-19-at-2.17.37-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-19-at-2.17.17-PM.jpeg)