వైఎస్ఆర్సిపికి ఘోరపరాభవం తప్పదు: జనసేన జానీ

పాలకొండ నియోజకవర్గం, జనసేన జానీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న నాడు నేడు కార్యక్రమంతో మీరు చేస్తున్న పబ్లిసిటీ క్షేత్రస్థాయిలో సౌకర్యాలు కల్పించడంలో చాలా విఫలమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల విలీనంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. స్కూల్ కి వెళ్ళే పిల్లలు నానా ఇబ్బందులు అవస్థలు పడుతున్నారు.. సరైన వసతులు సదుపాయాలు కల్పించకుండా చేయడం వల్ల పిల్లలతో పాటు ఉపాధ్యాయులు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామ స్థాయిలో ప్రాథమిక పాఠశాలలో విలీనం వల్ల చిన్న పిల్లలు వారి యొక్క స్కూల్ తల్లిదండ్రులకూ దూరం పెరగడం వల్ల.. సరైన రవాణా వ్యవస్థ లేకపోవడం వల్ల గ్రామ స్థాయిలో ప్రాథమిక విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రజల ఆలోచనలకు విరుద్ధంగానే పనిచేస్తున్నారు. జిల్లా విభజనలు విషయంలో గానీ పాఠశాల వీలునామా మార్పిడి విషయంలో గానీ మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా తప్పిద్ధం.. ఇప్పటికైనా మీ ఆలోచన విధానం మారకపోతే రాబోయే ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సిపి కి ఘోరపరాభవం తప్పదు.. అని జనసేన జానీ సలహా ఇవ్వడం జరిగింది.