రాజోలు నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి జనసైనికులకు ఆహ్వానం

తూర్పుగోదావరి జిల్ల, ది 14.12.2021 మంగళవారం నాడు రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ దిరిశాల బాలాజి ఇంటి వద్ద జరిగే రాజోలు నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిధిగా తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ హాజరుకానున్నారు. వీరితో పాటు ఈ సమావేశంలో జిల్లాకు చెందిన పలువురు ఇన్ఛార్జ్ లు మరియు ఎంపిటీసిలు, సర్పంచ్ లు హాజరుకానున్నారు. కావున జనసైనికులందరు భారీ సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమన్ని జయప్రదం చేయవల్సిందిగా జనసేన కాట్రేనిపాడు గ్రామ శాఖ అధ్యక్షులు ఉలిసి సత్తిబాబు, యూత్ ప్రెసిడెంట్ రేకపల్లి చెన్నకేశవ తెలిపారు.