పేషెంట్ జీరో’ను కనుక్కోవడం అసాధ్యమే: డబ్ల్యూహెచ్ఓ
కరోనా వైరస్ సోకిన తొలి వ్యక్తి ‘పేషెంట్ జీరో’ను కనుక్కోవడం అసాధ్యమేనని ప్రపంచ ఆరోగ్య సంథ పేర్కొంది. పేషెంట్ జీరోను ప్రపంచం ఎప్పటికీ కనుక్కోకపోవచ్చని డబ్ల్యూహెచ్ఓ వ్యాధుల విభాగం సాంకేతికాధిపతి మారయా వ్యాన్ కోర్కోవ్ అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ మూలాలను కనుక్కోవడం కోసం పదిమందితో కూడిన నిపుణుల బృందం చైనాలోని వూహాన్లో పరిశోధన ప్రారంభించింది. అయితే చాలా కాలం తర్వాత అక్కడికి చేరుకోవడంపైనా అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా కొత్త రకం కరోనా వైరస్లు బయటపడుతున్న నేపథ్యంలో ఈ సంస్థ పపంచ దేశాలను అప్రమత్తం చేసింది. వీటిని ఎదుర్కొనేందుకు వైరస్ సీక్వెన్సింగ్ను చేపట్టాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. అయితే, జెనెటిక్ కోడ్ సీక్వెన్సింగ్ విశ్లేషించడం అన్ని దేశాలకు సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడింది.