జనసైనికుడు రాముకు అర్థిక సహయం అందించిన బండారు శ్రీనివాస్

ఇటీవలే కామెర్లుతో హైదారాబాద్ లో చికిత్స పొంది ఇంటికి చేరిన నార్కెడిమిల్లి కి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త యాడ్ల రాముని వారి ఇంటి వద్ద కలిసి పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ అడిగి తెలుసుకుని, చికిత్స నిమిత్తం 40,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చేకూరి కృష్ణంరాజు, పిట్టా సత్యనారాయణ, తూము నర్సింహరావు, తుంగ బుజ్జిబాబు, కైరం నాగేశ్వరరావు, ముత్యాల ఆదిబాబు, మద్దూరి రామకృష్ణ, మెర్ల బంగారం, బందెల గణేష్, సజ్జా అమర్నాథ్, వంగా సాయి, సలాది జె.పి, బండారు అబ్బులు, కురసా వెంకన్న, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.