జనసైనికుడు నాగబాబును పరామర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ మండలం, స్వామినగర్ ప్రాంతానికి చెందిన క్రియాశీలక జనసైనికులు అప్పికొండ నాగబాబు ట్రాన్స్పోర్ట్ లో లోడింగ్ చేస్తున్న సమయంలో ప్రమాద వశాత్తూ బస్తాలు కాలుమీద పడి కాలు విరిగిపోవడం జరిగింది. ఈ క్రమంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న అప్పికొండను సోమవారం ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించి, వివరాలు తెలుసుకున్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ మరియు ఇతర నాయకులు.