మాట ఇచ్చి మడం తిప్పిడం జగన్ మోహన్ రెడ్డి అలవాటే: గాదె

పొన్నూరు నియోజకవర్గంలో ప్రభుత్వంపై గత 16 రోజుల నుంచి నిరసన తెలుపుతున్న అంగన్వాడి వర్కర్స్ దీక్షా శిబిరానికి వెళ్లి వారికి మద్దతు తెలిపిన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షలు గాదె వెంకటేశ్వరావు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ… జగన్ రెడ్డికి మాట ఇచ్చి మాట తప్పడం అలవాటునేనని తన ఇంట్లో ఉన్న అమ్మకి, చెల్లికి న్యాయం చేయనివాడు పేద ప్రజలకు ఏం న్యాయం చేస్తాడో ప్రజలు తెలుసుకోవాలని, తక్షణమే అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేనియెడల ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని అంగన్వాడి వర్కర్స్ కి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్లూరి అప్పారావు, మేకల రామయ్య యాదవ్, దేశంశెట్టి సూర్య, పొన్నూరు పట్టణ, మండల అధ్యక్షులు షేక్ కరీముల్లా, నాగిశెట్టి సుబ్బారావు, పట్టణ కమిటీ సభ్యులు ఎర్రసాని నాగభూషణం, కట్టా నాగరాజు, వలిసెట్టి శ్రీధర్, గడ్డమూరి చందు, ఆడిలే వసంతి, కసుకర్రు, ఉప్పరపాలెం, పచ్చల తాడిపర్రు గ్రామ అధ్యక్షులు ఎలవర్తి వెంకటేశ్వరరావు, గోవాడ మురళీకృష్ణ, హరి రామకృష్ణ, మండల కొండముది రామారావు, పసుపులేటి సుబ్బారావు మరియు జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.