ప్రతి రైతుకి బోరు వేయిస్తానని మాట ఇచ్చి మడమ తిప్పిన జగన్

  • జనసేన విజయ యాత్ర – ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ అప్ నీడ్స్ పవన్ కళ్యాణ్ – 52వ రోజు
  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం 52వ రోజు

శ్రీకాళహస్తి మండలం, రామానుజపల్లి పంచాయతీలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా. గ్రామాల్లో ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదుసుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరడం జరిగింది. రైతులకు ఉచిత బోరు వేస్తామని ఆ ఊసే లేదు, సి సి రోడ్డు లేవు, డ్రైనేజ్ కాలువల నిర్మాణం అస్సలు లేదని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని వినుత గారు ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడుదండి రాఘవయ్య, నాయకులు జనార్ధన్, జనసైనికులు గణేష్, శివ, రాము, పట్టణ అధ్యక్షుడు తోట గణేష్, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, నాయకులు రవి కుమార్ రెడ్డి, నితీష్ కుమార్, వెంకట రమణ యాదవ్, వినోద్ కుమార్, చందు యాదవ్, పేట చిరంజీవి, పేట చంద్ర శేఖర్, సురేష్, లక్ష్మి, శారద, జనసైనికులు బబ్లూ, డ్రువ్ కుమార్, బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.