జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు – హసేన్ బాష

అన్నమయ్య జిల్లా రాయచోటిలో స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో రాయచోటి అసెంబ్లీ ఇంచార్జ్ హసన్ బాష మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 12, 13, 14 తేదీల్లో జగనన్న కాలనీ ఇళ్లు, టిడ్కో ఇళ్ల పై జనసేన సోషల్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించినట్లు అన్నారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో జగనన్న కాలనీ ఇళ్లు, టిడ్కో ఇళ్ల పై జనసేన సోషల్ ఆడిట్ నిర్వహించనున్నారు. జగనన్న ఇళ్ళ పేరుతో అదికార పార్టీకి వైసీపీకి చెందిన నాయకులు కోట్ల రూపాయలు దోచుకున్నారని జగనన్న కాలనీల్లో అవినీతి పై పోరాటం చేయాలని రాయచోటి జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్చార్జ్ హసన్ బాష పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల పేరుతో చేపడుతున్న జగనన్న కాలనీలు అతి పెద్ద స్కాం అని పేర్కొన్నారు. అనంతరం జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 12, 13, 14 తేదీల్లో ‘జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తీసిన ఫోటోలు, వీడియోలను #JaganannaMosam హ్యాష్ ట్యాగ్ ద్వారా సోషల్ మీడియాలో పోస్టు చేసి ప్రభుత్వ పని తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు. నాయకులు, జనసైనికులు, అభిమానులు, ప్రజలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పఠాన్, యువనాయకులు, కోలా నవీన్, అర్ఫాద్, ఏహేషన్, నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.