జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బిసిలకు ప్రథమ స్థానం కల్పించారు: చందు


ఏలూరు టిడిపి ఇంచార్జ్ బడేటి చంటి ఆధ్వర్యంలో జయహొ బిసి కార్యక్రమంలో ఏలూరు జనసేన నాయుకులు మరియు జాతీయ బిసి సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి తాతపూడి చందు మాట్లాడుతు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే బిసిలకు ప్రాముఖ్యత ఇచ్చిందో 2019లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో బిసి లకు అదేవిదంగా సీట్లు ఇవ్వటం జరిగింది ఇక్కడ ఏలూరు, దెందులూరు నియోజకవర్గాలకు బిసి లకు ఇచ్చి బిసిలకు ప్రాముఖ్యత ఇచ్చిన ఘనత జనసేన పార్టీది బిసిలు చైతన్యవంతులు కావాలి రాజకీయంగా ఎదగాలి. బిసిలు పప్పు, ఉప్పు మీద పన్నులు కడుతుంటే ఈ అవినీతి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆయన పేరు వాళ్ళ బాబు పేర్లు పథకాలకు పెడుతున్నారు మన సొమ్ముతో వాళ్ళ పేర్లు ఏంటి, బిసిలు గత ఎలక్షన్స్ లొ జగన్ బొమ్మ మీద గెలిచారు అని చెప్పి ఇప్పుడు బిసిలను ఎందుకు మార్చుతున్నారు అంటే బొమ్మ చెరిగి పోయిందా బొమ్మ తిరగపడింద అని అడిగారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సవాలు విసురుతూ మీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి వార్డు మెంబర్ వరకు మీలో ఎవరైనా సరే 56 కార్పొరేషన్ లో బీసీలకు ఒక్క రూపాయి అయినా అందిందా కార్పొరేషన్ లో నిధులు ఏమైనా ఉన్నాయా దమ్ముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి దీనిపై సమాధానం తెలియజేయాలి అని చెప్పి ఏలూరు జనసేన నాయకులు చందు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.