జనం కోసం జనసేన – పవన్ అన్న కోసం కురుపాంసేన

కురుపాం నియోజకవర్గం: జియమ్మవలస మండలం, పెద్దబుడ్డిడిలో జనం కోసం జనసేన పవన్ అన్న కోసం కురుపాంసేన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామాన్ని సందర్శిస్తూ గ్రామంలో ఇంటింటికి తిరిగి, ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని.. జనసేన పార్టీ రూపొందించిన మేనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఓటమి భయంతోనే వైకాపా నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాశీస్సులతో త్వరలోనే రాష్ట్రంలో ప్రజా పాలన వస్తుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీకి ఒక అవకాశం ఇచ్చి 2024లో జనసేన పార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారి సీఎం చేయాలని నియోజవర్గ జనసేన నాయకులు& జనసైనికులు ఆ గ్రామం యొక్క ప్రజల్ని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వహణ కమిటీ పెంట శంకర్రావు, నియోజవర్గ ఐ టి కోఆర్డినేటర్ రంజిత్ కుమార్, కొమరాడ మండల అధ్యక్షులు శ్రీకర్, నియోజవర్గ నాయకులు రమేష్, రాజేష్, గౌరీ, శ్రీను, వెంకీ, భార్గవ్, పోలీ నాయుడు, ప్రేమ్, సుధా, సాయి మరియు వీరమహిళ మంగ &జనసేన నాయకులు & జనసైనికులు పాల్గొన్నారు.