జనసేన జన జాగృతి యాత్ర

  • 5వ రోజు గ్రామ గ్రామానా తేనిటీ విందు
  • దళితవాడలో జనసేన ప్రభంజనం

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో 5వ రోజు జన జాగృతి యాత్ర నిర్వహించడం జరిగింది. ప్రజల ఆదరణతో ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమం రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప కీలకపాత్ర వహిస్తున్న ఈ తేనిటీ విందు కార్యక్రమంలో రాజానగరం మండలం అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర ఆధ్వర్యంలో వేమవరురపు వెంకటేష్, వేమవరపు సుబ్రహ్మణ్యం, ఇజ్జిన చంటి, బొర్రా చిన్నబాబు, మళ్ళిమోగ్గల సాయిబాబు, నాగావరుపు భానుశంకర్, బొబ్బరడా వాసు, అడబాల సత్యనారాయణ, అడబాల హరి, సుంకర బాబ్జి, తెలగంశెట్టి శివ, ముక్క రాంబాబు లు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను గ్రామంలోని ప్రజలకు వివరిస్తూ జనసేన పార్టీ గుర్తు అయిన గ్లాజు గ్లాసుతో తేనీటిని ఇవ్వడం జరిగింది. దానికి ప్రజలందరూ సహకరించి ఈసారి జనసేన పార్టీని ఆశీర్వదించాలని, పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇచ్చి జనసేన ప్రభుత్వాన్ని స్థాపించాలని, గ్రామంలో ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ జనసేన షణ్ముఖ ముద్రించిన కరపత్రం పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో కానవరంలో భారీ ఎత్తున వీరమహిళలు, నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.