బొర్రా ఆధ్వర్యంలో జనసేనలో భారీగా చేరికలు

సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం పెద్ద నెమలిపురి గ్రామానికి చెందిన 100 కుటుంబాలు జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు సమక్షంలో వైసిపి నుండి జనసేన పార్టీలో చేరడం జరిగింది. వైకాపాది ఇక ముగిసిన అధ్యాయమే సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు అన్నారు. ఒక్క ఛాన్స్ అంటే నమ్మి అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అధోగతి పాలు చేశాడని అప్పారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పి గ్రామంలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. జనసేన పార్టీ పట్ల, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రైతులు, పేదలకు మేలు చేసే విధానాలకు మేము ఆకర్షితులమై జనసేన పార్టీలో చేరుతున్నామని పార్టీలో చేరిన వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణా, రాజుపాలెం మండలం అధ్యక్షులు తోట నరసయ్య, ముప్పాళ్ళ మండలం అధ్యక్షులు సీరిగిరి పవన్ కుమార్, సత్తెనపల్లి మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, సత్తెనపల్లి 7 వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బత్తుల కేశవ, గ్రామ అధ్యక్షులు వీర్ల శ్రీనివాసరావు, బట్టగిరి కొండలు, బట్టిగిరి రాములు, నాగిశెట్టి శ్రీను, బాట్టిగిరి వేంకటేశ్వర్లు, బెల్లంకొండ వాసు, గుత్తా భారత్ బాబు, గంగరపు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.