జనసైనికులకు, ప్రజలకు జనసేన పార్టీ అండగా ఉంటుంది

రంపచోడవరం నియోజవర్గం: అడ్డతీగల మండలం, లంగుపర్తి గ్రామంలో ఇటీవల కాలంలో జనసేన పార్టీ కార్యకర్తకు అనారోగ్యానికి గురై ఆపరేషన్ చేయించుకున్న బూసరి అప్పలస్వామికి జనసేన పార్టీ తరఫున కుటుంబానికి 5000 వేలు రూపాయలు రంపచోడవరం నియోజవర్గం జనసేన పార్టీ సమన్వయ కమిటీ అధ్యక్షులు కుర్ల రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. కళ్ళు లేని వృద్ధుడు పొలం ఉందని పింఛను తీసి వేయడం జరిగిన బూసరి వెంకటరమణకు 1000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. జనసేన పార్టీ ఎప్పుడు జనసైనికులకు ప్రజలకు అండగా ఉంటుందని, ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము తోడుగా ఉంటామని రాజశేఖర్ ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. మరియు అడ్డతీగల మండలం, జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం 50 కె.జి ల బియ్యం ఫ్రూట్స్ అందజేశారు. అడ్డతీగల మండలం నాయకులు కుప్పాల జయరాం ఆధ్వర్యంలో 20 కుటుంబాలు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల నచ్చి జనసేన పార్టీలో చేరగా, వారిని కుర్ల రాజశేఖర్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం మండల అధ్యక్షులు పాపోలు శ్రీనివాస రావు, రాజవొమ్మంగి మండల అధ్యక్షులు బొద్దిరెడ్డి త్రిమూర్తులు, అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం, గంగవరం మండలం అధ్యక్షులు కుంజం సిద్దు, కొంణం శ్రీనివాస్, పొడుగు సాయి, మణికంఠ, వెంకటేష్, ప్రసాదు, వెంకన్న, లోకేష్, రాజు, లక్ష్మణ్, వీరబాబు, లావరాజు, వెంకన్న బాబు, వీరమహిళలు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.