జనసేన తీర్థం పుచ్చుకున్న దళితులకు అండగా జనసేన

తాడేపల్లిగూడెం, దళితులకు అన్ని రకాలుగా జనసేన పార్టీ అండగా ఉంటుందని జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు సజ్జ సుబ్బు, కొనగల హరినాథ్ ఆధ్వర్యంలో పెంటపాడు కూనగారి పేటకు చెందిన యువత సుమారు 50 మందికి పైగా జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ దళితులకు మాయమాటలు చెప్పి అందరం ఎక్కిన తర్వాత అన్ని రకాలుగా మోసం చేసిన ప్రభుత్వం వైసీపీ అనీ ఈ వైసీపీ ప్రభుత్వం దళితులపై దాడులు జరుగుతుంటే చోద్యం చూస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల అధ్యక్షుడు పుల్లా బాబి, మహిళ నాయకురాలు కసిరెడ్డి మధులత, పెనుబోతుల సోమలమ్మా, చాపల రమేష్, మలబాకు చిట్టి, మన్నిడి రమేష్, నేదురు స్వామి నాయుడు, ముఖేష్, బొబ్బిలి శ్రీనివాస్, దిద్దే మధు, మాండ్ నేతి బాబు, దిద్దే సాయిబాబు, మూర్చ మహేష్ గెద్దాడ విజయరాజు తదితరులు పాల్గొన్నారు.