చంద్రబాబుకు మేము సైతం కార్యక్రమమానికి జనసేన మద్దతు

రంపచోడవరం నియోజవర్గం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అధికార వైసీపీ కక్షసాధింపు చర్యలో అక్రమకేసు పెట్టి జైలుకు పంపించినందున ఆదివారం రాష్ట్రం అంతటా టీడీపీ శ్రేణులు చేస్తున్న శాంతియుత ధర్నాలు చేపట్టగా జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైల్ నందు చంద్రబాబుని కలిసి మద్దతు తెలుపుతూ 2024లో టీడీపీ జనసేనపార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పటం రాష్ట్ర పరిస్థితి మారాలంటే ఉమ్మడి కార్యాచరణ చేద్దామని కొండంత బలాన్ని చేకూర్చారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలమేరకు టీడీపీకి మద్దతు పలుకుతూ చంద్రబాబుకు మేము సైతం అనే కార్యక్రమంలో రంపచోడవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు పాపోలు శ్రీను కుర్ల రాజశేఖర్, గంగవరం మండల అధ్యక్షుడు కుంజం సిద్దు, అద్దతీగల నాయకులు కుప్పాల జయరాం, సాయి, రాజవమంగి నాయకుడు లోకేష్, దేవిపట్నం మండల అధ్యక్షుడు చారపు వెంకటరాయుడు, వైస్ అధ్యక్షుడు కర్రీ మహేష్, మండల నాయకులు శ్రీను మొదలైనవారు పాల్గొన్నారు.