గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు జనసేన మద్దతు

పాలకుర్తి నియోజకవర్గం: గ్రామపంచాయతీ కార్మికులకు అండగా జనసేన పార్టీ ఉంటుందని పాలకుర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి వెల్తూరి నగేష్ అన్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది చేపట్టిన నిరావధిక సమ్మె 28వ రొజుకు చేరగా జనసేన నాయకులు జిపి సిబ్బందికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ.. జిపిఎస్ సిబ్బందికి పనికి తగ్గ వేతనం అందించాలని కార్మికులకు ప్రమాద బీభ సౌకర్యం కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. గ్రామపంచాయతీ సిబ్బంది కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కార్మికుల డిమాండ్లను నెరవేర్చలేని ఎడల నిరవధిక సమ్మెను కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తోరూర్ మండల డివిజన్ అధ్యక్షులు పల్లెర్ల రమేష్, ఉపాధ్యక్షులు జలకం శివ, గట్ల సతీష్ లు తదితరులు పాల్గొన్నారు.