టీడీపీ సామూహిక నిరాహర దీక్షకు నిడదవోలు జనసేన మద్దతు

నిడదవోలు నియోజకవర్గం: టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, చంద్రబాబు నాయుడు ఆక్రమ అరెస్ట్ కు నిరసనగా నిడదవోలు పట్టణం గణేష్ చౌక్ సెంటర్ లో సామూహిక నిరాహార దీక్ష చేపట్టిన కుందుల సత్యనారాయణకు మద్దతుగా నిడదవోలు మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జనసేన నాయకులు సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిడదవోలు జనసేన పార్టీ మండలం అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ప్రతిపక్షాలను భయబ్రాంతులు గురిచేయడానికి, బెదిరించడానికి, భయపెట్టడానికి, దౌర్జన్య కాండ, దుర్మార్గత్వం, నియంత పరిపాలన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీరు అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగానికి విరుద్దంగా చట్టంలో ఉన్న అనుకూల విషయాలను ఆసరాగా తీసుకుని అధికార పార్టీ మితిమీరిన రీతిలో అక్రమ అరెస్ట్ చేసిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ మద్దతు పలికారని త్వరలోనే ప్రజా ప్రభుత్వం ఏర్పటు అవుతుందని తెలిపారు. అనంతరం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమణ చేయించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండలం జనసేన అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, పాలా వీరాస్వామి, పెండ్యాల ఎంపీటీసీ ఇంద్రగౌడ్, వీరమహిళ బెల్లపుకొండ పుష్పావతి, యడ్లపల్లి సత్తిబాబు, యమన కాశీ దుర్గ ప్రసాద్, సేపేన్య దుర్గాప్రసాద్, ఆకుల నాగేశ్వరావు, పలువురు జనసేన నాయకులు, జనసైనికులు కలిసి సంఘీభావం తెలియజేసారు.