చీపురుపల్లి నియోజకవర్గంలో జనసేన -టీడీపీ ఆధ్వర్యంలో గుంతల రోడ్లపై నిరసన

చీపురుపల్లి నియోజకవర్గం: గుంతల ఆఒధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమంలో భాగంగా చీపురుపల్లి నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితిపై ఆదివారం డిజిటల్ క్యాంపైనింగ్ నిర్వహించడం జరిగింది. గరివిడి మండలం వెదులవలస నుండి చీపురుపల్లి రహదారులను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా, నియోజకవర్గం ఇంఛార్జ్ కిమిడి నాగార్జున, మరియు జనసేన పార్టీ గరివిడి మండలం అధ్యక్షుడు పెద్ది వెంకటేష్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు బోడసింగి రామకృష్ణ పాల్గొని రోడ్ యొక్క దుస్థితిని పరిశీలించి అనంతరం స్థానిక ప్రజలను గత నాలుగు సంవత్సరాలుగా ఈ రోడ్ నిర్మాణం కాకపోవడం వలన జరుగుతున్న ప్రమాదాలు, పడుతున్న ఇబ్బందులు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోఆర్డినేటర్ అగురు వినోద్, జిల్లకార్యనిర్వహక కార్యదర్శి ధన్నాన యేసు, బాలకృష్ణ, బాకురు శ్రీను, రాగోలు రామక్రిష్ణ, పళ్ళికుమార్, సత్యనారాయణ, చిరంజీవి, మరియు తెలుగుదేశం పార్టీ గరివిడి మండల అధ్యక్షుడు సారిక సురేష్, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు పైల బలరాం తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.